Thursday, May 2, 2024

దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు

spot_img

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. కొత్తరూపు సంతరించుకున్న కోవిడ్‌.. జేఎన్‌.1 (JN.1) సబ్‌వేరియంట్‌ రూపంలో వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇవాళ(ఆదివారం) కొత్తగా 841 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత ఏడు నెలల్లో ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. తాజా కేసులతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,309కి చేరింది. అదేవిధంగా కొత్తగా మరో ముగ్గురు మృతి చెందారు. వారంతా కేరళ, కర్ణాటక, బీహార్‌కు చెందినవారని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ.

ఇది కూడా చదవండి: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్

Latest News

More Articles