Sunday, May 5, 2024

న్యూ ఇయర్ ఆఫర్.. కేజీ కేక్ కొంటే బిర్యానీ ఫ్రీ

spot_img

కొత్త సంవత్సరానికి వెల్‎కమ్ చెప్పేందుకు అందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 2023లో జరిగిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. 2024లో అంతా మంచే జరగాలని ఆశిస్తూ.. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు. అందుకోసం అందరూ కొత్త ఏడాది వేడుకలు చేసుకుంటుంటారు. కొందరు కుటుంబాలతో గడిపితే.. మరికొంతమంది మాత్రం స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటారు. బ్యాచిలర్స్ అయితే ఫ్రెండ్స్‎తో కలిసి వెకేషన్‎కి ప్లాన్ చేసుకుంటారు. వీరందరినీ ఉత్సాహ పరిచేలా వ్యాపార వర్గాలు కూడా చాలా రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్, ఫుడ్, డ్రింక్స్, షాపింగ్, కేక్స్.. ఇలా పలు రకాల వాటిపై డిస్కౌంట్లు పెడుతుంటారు.

Read Also: నల్గొండ జిల్లాలో రైలు కిందపడి ప్రేమజంట సూసైడ్

తాజాగా ఓ షాపు యజమాని న్యూ ఇయర్ సందర్భంగా కిరాక్ ఆఫర్ ప్రకటించాడు. న్యూ ఇయర్ వేడుకల కోసం కేక్ కొన్నవారికి చికెన్ బిర్యానీ ఉచితంగా ఇస్తానంటూ బోర్డు పెట్టాడు. ఏపీలోని నందిగామలో న్యూ బెంగుళూర్ అయ్యంగార్ బేకరీ ఉంది. ఈ బేకరీ ఒక కేజీ కేక్ కొంటే మిని చికెన్ బిర్యానీ ఉచితంగా ఇస్తున్నారు. ఇలా అని ఆ కేక్ ధర కూడా మరీ ఎక్కువగా ఏం లేదు. కేజీ కేక్ కేవలం రూ. 250 లకే అందిస్తున్నాడు. రూ. 250కే కేక్‎తో పాటు బిర్యానీ కూడా వస్తుండటంతో స్థానికులు ఎగబడుతున్నారు.

Latest News

More Articles