Sunday, April 28, 2024

తల్లిదండ్రుల గొడవ చూడలేక.. 10వ తరగతి బాలుడు ఆత్మహత్య

spot_img

సికింద్రాబాద్: ఇంట్లో తరచూ తల్లిదండ్రులు పడుతున్న గొడవను చూసి విసిగిపోయిన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సికింద్రాబాద్ తుకారాంగేట్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి దండ్రులు గొడవ పడుతుండడంతో వారి తీరుపై విసిగి పోయిన రాహుల్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read.. సంక్రాంతికి ఊపిరి పీల్చుకున్న హైదరాబద్

రాహుల్ తుకారాంగేట్  ప్రాంతంలోని  ఓ స్కూళ్లో 10వ తరగతి చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తుకారాంగేట్ పోలీసులు తెలిపారు.

Latest News

More Articles