Monday, May 6, 2024

విషాదం.. దావత్ లో మటన్ ముక్క తిని.. బాలుడు మృతి

spot_img

రంగారెడ్డి జిల్లా: దావత్ కు వచ్చి మటన్ ముక్క తిని ఓ బాలుడు మృతి చెందాడు.  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఈ విషాదకర ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్ నగర్ సమీపంలో ని బాలానగర్ మండలం మామిడి గుట్ట తండా కు చెందిన మున్నా అనే బాలుడు.. బంధువుల ఇంటికి దావత్ కు వెళ్లాడు.

Also Read.. వంద‌కు వంద శాతం రైతుబంధు కొన‌సాగిస్తాం

భోజనం చేస్తున్న సమయంలో మాంసం ముక్క గొంతులో ఇరుక్కుపోయి.. ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు షాద్ నగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

Latest News

More Articles