Sunday, May 5, 2024

హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం…ఆరుగురు మృతి.!!

spot_img

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమావారం ఉదయం 9.45 నిమిషాల సమయంలో నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు సమాచారం. ప్రమాదంలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఊపిరాడక మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం ఓ అపార్ట్ మెంట్ కింది భాగంలో గత కొన్నేళ్లుగా ఓ కెమికల్ గోడౌన్ ఉంది. అది జీ ప్లస్ నాలుగవ అంతస్తుల భవనం. అందులో ఉదయం మంటలు వ్యాపించాయి. పొగలు సెకన్లలో నాలుగు అంతస్తుల్లోకి వ్యాపించాయి. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. ఆ భవనంలో మొత్తం 60మంది నివసిస్తున్నారు. కెమికల్ అంటుకుని 4 అంతస్తుల వరకు వ్యాప్తించింది. దీంతో ఊపిరాడక జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.

పటాకులతోనే అగ్నిప్రమాదం జరిగిందని..ఎవరు చేశారన్న సంగతి తెలియదని స్థానికులు అంటున్నారు. కాగా గోడౌన్ ముందు పార్కింగ్ చేసిన టూవీలర్లు, కారు కూడా దగ్దం అయ్యింది. ఇక పోలీసులు 16మందిని కాపాడినట్లు తెలిపారు. కెమికల్స్ వల్లే షార్ట్ సర్య్కూట్ కావొచ్చని భావిస్తున్నారు. మంటల్లో గాయపడ్డన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : టపాసులు కాల్చినవారికి షాకిచ్చిన పోలీసులు..!!

Latest News

More Articles