Saturday, May 4, 2024

విషాదం: ఇద్దరు పిల్లలతో వీధిలో నడుస్తుండగా.. కూలిన పైకప్పు

spot_img

చండీగఢ్‌: తన ఇద్దరు పిల్లలతో వీధిలో నడుస్తున్న ఒక మహిళపై ఓ ఇంటి పైకప్పు వారిపై కూలింది. ఈ సంఘటనలో ఆ ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పంజాబ్‌ రాజధాని చండీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది.

మణిమజ్రా ప్రాంతంలో పాతి ఇంటిని కొందరు కూల్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిర్లక్ష్యం వహించిన ఆ ఇంటి యజమానితోపాటు, ఇంటిని కూల్చుతున్న కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles