Friday, May 10, 2024

 సంగారెడ్డి జిల్లాలో యువకుడి ఫై మరో యువకుడు యాసిడ్ దాడి

spot_img

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో యువకుడి ఫై మరో యువకుడు యాసిడ్ దాడి చేసాడు. విజయ డైరీలో పనిచేస్తున్న అజయ్, దత్తు ఫ్రెండ్స్. వీరిద్దరి మధ్య తాజాగా గొడవ జరిగింది. దీంతో యువకులిద్దరూ గొడవ పడ్డారు. అంతటి తో ఆగకుండా కొట్టుకున్నారు. ఈ క్రమంలో గొడవ మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. గొడవ కారణంగా ఆగ్రహానికి లోనైన అజయ్..దత్తుపై యాసిడ్ తో దాడికి పాల్పడ్డాడు. దీంతో అజయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అజయ్ ని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles