నార్సింగిలో గంజాయి చాక్లెట్ల కలకలంరేగింది. కోకాపేట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని ఒరిస్సాకు చెందిన సౌమ్య రాజన్గా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో పట్టుకొని నిందితుని నుంచి 40 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్ట్మెంట్లో కార్మికులకు అమ్ముతుండగా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఒడిస్సా నుంచి హైదరాబాద్కు ఉపాధి కోసం వచ్చి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
Read Also: కోమటిరెడ్డి.. ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తించు..లేకుంటే ప్రతి చర్య తప్పదు
అయితే కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి. నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపరిచారు. లావణ్య అనే యువతి విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. లావణ్య మ్యూజిక్ టీచర్గా పని చేస్తూ.. పలు చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించింది. షార్ట్ ఫిలింస్లోనూ హీరోయిన్గా నటిస్తూ.. లావణ్య జల్సాలకు అలవాటుపడింది. ఆ తర్వాత ఒక హీరోకు పరిచయమై.. లవర్గా మారింది. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో లావణ్య అనుమానితురాలుగా ఉంది. గత కొంతకాలంగా లావణ్య.. ఉనీత్ రెడ్డి గోవా నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు గుర్తించారు. వీరిద్దరూ డ్రగ్స్ వాడటమే కాకుండా.. అమ్ముతున్నట్లు కూడా తేలింది. ఒక్కో గ్రామ్ గోవాలో రూ. 1500లకు కొనుగోలు.. ఇక్కడ రూ. 6 వేలకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. లావణ్య.. చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతో లావణ్య సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత చాట్ని పరిశీలించాలని పోలీసులు భావిస్తున్నారు. లావణ్యకు చాలామంది వీఐపీలతో పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. దాంతో లావణ్యను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం లావణ్య, ఉనీత్ రెడ్డి పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారు.