Wednesday, May 1, 2024

సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు దుర్మరణం.!

spot_img

సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్ పల్లి-అద్దంకి జాతీయ రహదారి నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు మరణించాడు. టూటౌన్ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని జనార్థన్ రావు సమీపంలోని లెప్రసీ కాలనీ ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం దగ్గరకు బుధవారం సాయంత్రం వాకింగ్ కోసం పానగల్ బైపాస్ మీదుగా టూవీలర్ పై వెళ్తున్నారు.

తన వ్యవసాయ భూమి వద్ద టర్న్ తీసుకుంటున్న సమయంలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు కారును స్వయంగా నడుపుతూ వెళ్తున్న రఘుబాబు..వెనక నుంచి బైక్ ను బలంగా ఢీకొట్టారు. దీంతో జనార్థన్ రావు ఎగిరి డివైడర్ మీద పడ్డాడు. తల, ఛాతి భాగంగా బలమైన గాయాలై అక్కడిక్కడే మరణించారు. ఆయనకు కుమార్తె, కొడుకు ఉన్నారు. జనార్ధన్ రావు భార్య నాగమణి ఫిర్యాదుతో రఘుబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు సీఐ తెలిపారు.

ఇది కూడా  చదవండి: ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు.!

Latest News

More Articles