నిరుద్యోగులకు తెలంగాణ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. టీచర్ పోస్టులకు సబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5089 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఈ నెల 20 నుంచి వచ్చే నెల అక్టోబర్ 21 వరకు స్వీకరించనున్నారు. దరఖాస్తులను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. పరీక్ష కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ముగిసిన ఒక నెల తర్వాత పరీక్షలను నిర్వహిస్తారు. నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్తో 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 608 లాంగ్వేజ్ పండిట్స్, 164 పీఈటీ పోస్టులను భర్తీ చేయనున్నారు.