అమర్ నాథ్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర జరగనుంది. అనంతనాగ్ జిల్లా పహల్గామ్, గండర్బాల్ జిల్లా బల్టాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది.
యాత్రలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రార్థనలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో.. భూమికి 3,880 మీటర్ల ఎత్తులో అమర్నాథ్ ఆలయం ఉంది. అమర్ నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలి వెళ్తుంటారు.