Thursday, May 2, 2024

జులై 1వ తేదీ నుంచి అమ‌ర్ నాథ్ యాత్ర ప్రారంభం

spot_img

అమర్ నాథ్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్ర జరగనుంది. అనంతనాగ్​ జిల్లా పహల్గామ్​, గండర్​బాల్​ జిల్లా బల్టాల్​ మార్గాల్లో అమర్​నాథ్​ యాత్ర కొనసాగుతుంది.

యాత్రలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రార్థనలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

దక్షిణ కశ్మీర్​లోని హిమాలయ పర్వతాల్లో.. భూమికి 3,880 మీటర్ల ఎత్తులో అమర్​నాథ్​ ఆలయం ఉంది. అమర్‌ నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలి వెళ్తుంటారు.

Latest News

More Articles