బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ టెన్నిస్ బాల్ టీ10 క్రికెట్ టోర్నీ ఇండియన్ స్ట్రీట్ ప్రిమియర్ లీగ్ (ఐఎస్పీఎల్)లో అడుగుపెట్టాడు. ఈ లీగ్లో పాల్గొనే ముంబయి జట్టను అమితాబ్ కొనుగోలు చేశాడు. వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ముంబయిలో తొలి ఐఎస్పీఎల్ జరుగనుంది. హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోల్కతా, శ్రీనగర్ జట్లు బరిలో దిగే ఈ లీగ్లో 19 మ్యాచ్లు నిర్వహిస్తారు. బాలీవుడ్ హీరోలు అక్షయ్కుమార్, హృతిక్ రోషన్ కూడా ఇటీవలే ఐఎస్పీఎల్ జట్లను కొనుగోలు చేశారు. శ్రీనగర్ను అక్షయ్.. బెంగళూరును హృతిక్ తీసుకున్నారు.
Read Also: పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వచ్చే మూడు రోజుల్లో మరింత చలి తీవ్రత