Tuesday, May 7, 2024

బార్డర్ లో చొరబాటుకు యత్నం. కాల్చిచంపిన బీఎస్ఎఫ్ బలగాలు

spot_img

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ కు చెందిన ఓ చొరబాటుదారున్ని భద్రత బలగాలు కాల్చి చంపాయి. మరణాయుధాలతో ఆ వ్యక్తి బార్డర్ లోకి చొరబడేందుకు ప్రయత్నించటంతో బీఎస్ఎఫ్ బలగాలు అతన్ని కాల్చేశాయి. ఉదయం 8.30 గంటలకు అతను పంజాబ్ లోని గురుదాస్ పూర్ సెక్టార్ సరిహద్దు దాటేందుకు ప్రయత్నించాడు. చన్నా ఔట్ పోస్ట్ వద్ద ఆ వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా కనిపించటంతో అతన్ని జవాన్లు హెచ్చరించారు. నిషేధిత ప్రాంతంలోకి రావద్దని హెచ్చరించినప్పటికీ అతను పట్టించుకోలేదు. దీంతో జవాన్లు అతన్ని చంపేశారు. మృతుని వద్ద ఒక తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

Latest News

More Articles