Thursday, May 2, 2024

టెయిల్ పాండ్ కుడివైపు నుంచి మొత్తం నీటిని లూటీ చేసిన ఏపీ ప్రభుత్వం

spot_img

నల్గొండ జిల్లాలో బయటపడింది నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం. నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఉన్న టెయిల్ పాండ్ లో నీటి నిల్వలు ఖాళీ అయ్యాయి. నీటి చౌర్యం జరుగుతుందని తెలిసినా చోద్యం చూశారు అధికారులు. అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది తెలంగాణ జెన్కో. గత కొద్ది రోజులుగా టెయిల్ పాండ్ కుడివైపు నుంచి మొత్తం నీటిని మొత్తం లూటీ చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఉమ్మడి నల్గొండ ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు తలెత్తనున్నాయి. రెండు రోజుల కిందట అడవిదేవులపల్లి దగ్గర ఉన్న టెయిల్  పాండ్ ను సందర్శించారు కమిషనర్ సుల్తానియా. టెయిల్ పాండ్ లోని నీటిని గుట్టుచప్పుడు కాకుండా తరలించిన ఏపీ వ్యవహారాన్ని స్థానిక అధికారులతో చర్చించారు. నీటి చౌర్యం వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి తెలిపారు ఇరిగేషన్ అధికారులు. దీంతో ఏపీ కుట్రలపై KRMB కి లేఖ రాయాలనే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది

Latest News

More Articles