Monday, May 6, 2024

చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు

spot_img

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో ఆయను ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అంగళ్లు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ మేరకు తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. రూ. లక్ష పూచీకత్తుతో పాటు ఇద్దరు గ్యారెంటీ సమర్పించాలని కోర్టు పేర్కొంది. అన్నమయ్య జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సందర్భంగా అంగళ్లు కూడలి వద్ద చోటు చేసుకున్న ఘటనలో టీడీపీ నేతలతోపాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 8న కేసు నమోదు చేశారు.

ఇకపోతే తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ను భద్రపరచాలని చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్ మీద విచారణను కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.

Read Also: ఎక్కడికక్కడ పోలీసుల తనిఖీలు.. ఇప్పటివరకు రూ. 20 కోట్లు స్వాధీనం

Latest News

More Articles