ఢిల్లీలో ఓ ఏఎస్ఐ తాగిన మత్తులో బీభత్సం సృష్టించాడు. ఫుల్ గా తాగి డ్రైవింగ్ చేయటమే కాకుండా దాదాపు ఆరు వాహనాలను ఢీకొట్టాడు. ద్వారాక ప్రాంతంలో ఓ రెడ్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను అతను ఢీకొట్టాడు. విచక్షణ రహితంగా వాహనం నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనలో ఆ ఏఎస్ఐ తో పాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనాలు ధ్వంసమయ్యాయి. సదరు ఏఎస్ఐ ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేస్తున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన ఏఎస్ఐ నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని కేసు నమోదు చేశారు.