Wednesday, May 8, 2024

బీజేపీ మద్దతుతోనే మణిపూర్ దాడులు..!

spot_img

న్యూఢిల్లీ: మణిపూర్ హింసాత్మక ఘర్షణలపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. మణిపూర్ లో గిరిజనులపై బీజేపీ సంపూర్ణ మద్దతుతోనే దాడులు జరుగుతున్నాయని.. మణిపూర్ ట్రైబల్ ఫోరమ్ సుప్రీంలో పిటిషన్ వేసింది. ఆధిపత్య సమూహానికి కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు ఇస్తుందన్న పిటిషన్ లో మణిపూర్ ట్రైబల్ ఫోరమ్ పేర్కొన్నది. భారత రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధమైన లౌకిక రహిత ఎజెండా కారణంగా దాడులకు ప్లాన్ చేసినట్లు తెలిపిన మణిపూర్ ట్రైబల్ ఫోరమ్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది.

Latest News

More Articles