Saturday, May 4, 2024

సీఎం గారు బూతులు ఆపండి.. ముందు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయండి..!

spot_img

తెలంగాణ రాజకీయాల్లో బూతులతో పోటీ పడే నాయకుల్లో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సీఎంవి కదా ఏంటీ ఆ బూతులు అంటే.. కేసీఆర్ పేరు చెప్పి తప్పించుకుంటాడు. అప్పుడంటే ఉద్యమం. ఎమోషన్స్ తో ముడిపడ్డ అంశం. సెంటిమెంట్ పీక్స్ లో ఉండేది. హక్కులపై పోరాటంలో కేసీఆర్ కొన్ని పదాలు వాడాడు కావొచ్చు. ముఖ్యమంత్రి అయ్యాక చక్కగా పరిపాలన చేసుకోలేదా ఎక్కడ పరుష పదజాలం వాడలేదు. కానీ రేవంత్ మాత్రం అధికారిక సమావేశాల్లో కూడా బూతుల వర్షం కురిపిస్తున్నాడు. తొక్కుతా, చంపుతా, బొందపెడుతా.. ఇలా రౌడీ డైలాగ్స్ కొడుతూ తిరుగుతున్నాడు. అలాంటి రేవంత్ పై బండి సంజయ్ తాజాగా చక్కటి కౌంటర్లు ఇచ్చాడు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే మాట తప్పుతున్నారని ఫైర్ అయ్యారు. మేనిఫెస్టోలో భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని సీఎం అన్నారని గుర్తు చేశారు. ప్రతిహామీని నేరవేరుస్తామని ప్రకటించిన రేవంత్ మాట తప్పారన్నారు. హామీలన్నీ మరిచిపోయాడని మండిపడ్డాడు. ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ నియామకాలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని..కానీ ఇప్పటివరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ మాటే ఎత్తడం లేదని విమర్శించారు. మేనిఫెస్టో ఎన్నికల వరకే పవిత్ర గ్రంథమా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత చిత్తు కాగితామా అంటూ ప్రశ్నలు సంధించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ కు లోకసభ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు బండి సంజయ్.

Latest News

More Articles