Wednesday, May 1, 2024

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు..ఇద్దరు అరెస్టు.!

spot_img

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం దగ్గర కాల్పులు జరిపిన కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల అనంతరం ముంబై నుంచి పరారైన వారు గుజరాత్ లోని భుజ్ లో పోలీసులు చిక్కినట్లు అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ముంబైకి తీసుకువచ్చి విచారిస్తామని పేర్కొన్నారు.

ఈ నిందితులు ఇద్దరు కూడా నవీ ముంబై పన్వెల్ లోని హరిగ్రామ్ ప్రాంతంలో నెలరోజులుగా రూము అద్దె తీసుకుని అక్కడే మకాం వేసినట్లు ఓ అధికారి తెలిపిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ కు పన్వెల్ లోనే ఫాం హౌస్ ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం ముగ్గురిని విచారించారు. వీరిలో నిందితులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని, నిందితులు ఉపయోగించిన టూవీలర్ పూర్వ యజమాని, మోటార్ సైకిల్ ను విక్రయించడంలో సహాయం చేసిన ఏజెంట్ ఉన్నారు. వీరితోపాటు మరికొందరిని కూడా ప్రశ్నించారు. టూవీలర్ పూర్వ యజమానిది కూడా పన్వెల్ అని ప్రాథమిక విచారణలో తేలింది.

ఆదివారం ఉదయం ఐదు గంటల సమయంల బాంద్రా ప్రాంతంలో సల్మాన్ ఖాన్ ఉండే గెలాక్సీ అపార్ట్ మెంట్స్ దగ్గర మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు దండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాగా ఈ కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ బాధ్యత వహించాడు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అన్మోల్ దీనిని ట్రైలర్ మాత్రమే అని చెప్పాడు.

ఇది కూడా చదవండి: ఘోరప్రమాదం..వంతెనపై నుంచి పడిన బస్సు..ఐదుగురు మృతి.!

Latest News

More Articles