Sunday, May 5, 2024

రోడ్‌ షోలో రైతు ధరావత్‌ నర్సింహాను కలిసి ధైర్యం చెప్పిన కేసీఆర్‌

spot_img

సూర్యాపేట నుంచి భువనగిరికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రోడ్‌ షో కొనసాగుతోంది. ముందుగా తిమ్మాపురం, అర్వపల్లి, దేవరుప్పల, పాలకుర్తి, ఆలేరు మీద కేసీఆర్‌ రాయదుర్గం చేరుకున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామ సమీపంలోని దుబ్బ తండా రైతు ధరావత్‌ నర్సింహాను కేసీఆర్‌ కలిశారు. ఈ సందర్భంగా తన పొలానికి నీళ్లందక పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కండ్ల నీళ్లు పెట్టుకున్న రైతు ధరావత్‌ నర్సింహాకు కేసీఆర్‌ ధైర్యం చెప్పారు.

తన ఐదెకరాల వరి పంట ఎండిపోవడంతో ఎంతో ఆవేదనతో పొలంలోనే దుఃఖించిన రైతు ధరావత్‌ నర్సింహా వీడియో ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే తన రోడ్‌ షోలో భాగంగా దుబ్బా తండా దగ్గర ఆగిన కేసీఆర్‌ ధరావత్‌ నర్సింహాను కలిసి ధైర్యం చెప్పారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లు

Latest News

More Articles