Sunday, May 5, 2024

నిజామాబాద్ జిల్లాలో అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం.!

spot_img

నిజాబాబాద్ జిల్లాలో అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్థరాత్రి ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్ని మండలం బడాపహాడ్ కు 30 మందికిపైగా భక్తులతో వెళ్తున్నడీసీఎం వ్యాను బోల్తాపడటంతో…క్యాబిన్ లో కూర్చున్న ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. గాయపడిన 15మంది క్షతగాత్రులను జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయలయ్యాయని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడినవారిలో చిన్నారులు, మహిళలు ఎక్కువమంది ఉన్నారు. వీరంతా కమ్మర్ పల్లి మండలానికి చెందినవారిగా గుర్తించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ కు విషయం తెలియడంతో ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

ఇది కూడా చదవండి: రోడ్‌ షోలో రైతు ధరావత్‌ నర్సింహాను కలిసి ధైర్యం చెప్పిన కేసీఆర్‌

Latest News

More Articles