హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరామని తెలిపారు. యాక్షన్ తీసుకుంటామని స్పీకర్ చెప్పినట్లు చెప్పారు. ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు పాడి కౌశిక్ రెడ్డి.
పంజాగుట్ట లో బీడీలో అమ్ముకునేటోడు దానం నాగేందర్ అన్నావు.. ఇప్పుడు ఆ అమ్మేటోడినే ఎలా తీసుకుంటావని అన్నారు. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది మూడు నెలల్ల చర్యలు తీసుకోవలని. నువ్వు కొట్టినావు మేము తీసుకున్నాం.. మేము కొట్టినప్పుడు నువ్వు లేవలేవు రేవంత్ రెడ్డి అని హెచ్చరించారు. నోటీకోచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి.
ఇది కూడా చదవండి:దర్యాప్తు సంస్థపై చర్యలు తీసుకోండి