రంగారెడ్డి జిల్లా : చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి చెందింది. చిరుత మృత్యువాతపడి 5 రోజుల అవుతుందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. సంఘటన స్థలంలోనే చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. త్వరలోనే చిరుత మృతికి కారణాలను వెల్లడిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అంతకుముందు చిరుత కళేబరం చూసిన గొర్రెలకాపరులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు.