అమరావతి : ఏపీలో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ ఏగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్, సెంకడీయర్ ఎగ్జామ్స్ మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ఎగ్జామ్స్ ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. టైంటేబుల్ కోసం http:// bie.ap.gov.in వెబ్ సైట్ చూడాలని అధికారులు సూచించారు.