Sunday, May 5, 2024

మహారాష్ట్ర నాగ్‎పూర్ లో బీఆర్ఎస్ తొలి కార్యాలయం ప్రారంభం

spot_img

జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ పార్టీ పలు రాష్ట్రాల్లో విస్తరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది.ఇందులో భాగంగా మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలను నిర్వహించిన గులాబీ బాస్ పార్టీ కార్యాలయాన్ని మహారాష్ట్రలో ప్రారంభించారు. నాగ్‎పూర్ లో ని గాంధీబాగ్ లో అత్యాధునిక హంగులతో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇప్పటికే ఢిల్లీ, ఏపీలో పార్టీ శాశ్వత కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్ మహారాష్ట్రలో తోలి ఆఫీస్ ని ప్రారంభించుకుంది .

ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో నాగ్‎పూర్ పట్టణం అంతా గులాబీమయంగా మారింది. ఇదే తరహాలో త్వరలోనే ముంబై,పూణేతో పాటు ఔరంగాబాద్ మరియు నాందేడ్ లో కార్యాలయాలను ప్రారంభించనున్నారు.

Latest News

More Articles