Wednesday, May 8, 2024

గవర్నర్, మంత్రులతో సీఎం కేసీఆర్ గ్రూప్ ఫోటో

spot_img

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి రాష్ట్ర కేబినెట్ మినిస్టర్ గా గురువారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ గారు ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో గవర్నర్ తో కలిసి తన మంత్రి మండలి సభ్యులందరితో గ్రూపు ఫోటో సెషన్ లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, తదితర ప్రజాప్రతినిధులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

Latest News

More Articles