ఈ రోజుల్లో ఎవరూ డబ్బులు పాకెట్లో పెట్టుకొని తిరగడంలేదు. అన్ని లావాదేవీలు యూపీఐతోనే చేస్తున్నారు. కచ్చితంగా లిక్విడ్ క్యాష్ కావాలనుకుంటే మాత్రమే ఏటీఎంకు వెళ్తున్నారు. అలా డబ్బులు అవసరముండి ఏటీఎంకు వెళ్లిన వ్యక్తికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అతడు మెషిన్లో ఎంటర్ చేసిన అమౌంట్కి డబుల్ అమౌంట్ బయటకు వచ్చింది.
Read Also: మీ ఓటు నాకే వేయాలంటూ హీరో నాని ప్రచారం.. పోటీ ఎక్కడో తెలుసా?
ఏటీఎం నుండి మనీ డ్రా చేసినప్పుడు వందకు రెండువందలు, వెయ్యికి రెండు వేలు వస్తుంటాయి. ఇలా పలు ప్రాంతాలలో టెక్నికల్ సమస్యతో ఇలాంటివి జరుగుతుంటాయి. తాజాగా లండన్లో కూడా ఇదే జరిగింది. లండన్లోని ఈస్ట్ హ్యామ్ హై స్ట్రీట్లోని ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాని కారణంగా కస్టమర్ ఎంటర్ చేసిన దానితో పోలిస్తే రెండింతలు ఎక్కువ డబ్బు బయటకు వచ్చింది. విషయం తెలిసి జనాలు ఏటీఎంకు క్యూ కట్టారు. చూస్తుండగా ఏటీఎం జనాలతో కిటకిటలాడిపోయింది. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరల్గా మారింది.
Cash machine on East Ham High Street has gone rogue giving customers double cash 🤑👀 #IG1IG3 #EastHam pic.twitter.com/Pyzu7uG2VY
— INSTA: IG1IG3 (@Ig1Ig3) November 14, 2023