సిద్దిపేట జిల్లా: గజ్వేల్ పట్టణంలో హుజూరాబాద్ కు చెందిన ఈటల రాజేందర్ దళిత బాధిత సంఘం ఆధ్వర్యంలో లో మీడియా సమావేశం నిర్వహించారు. హుజూరాబాద్ లో తమాపై ఈటల అక్రమ కేసులు వేసి వేధించారని, ఆయన అక్రమాలపై 50 వేల కరపత్రాలు విడుదల చేశారు. ఆయన అరాచకాలను గజ్వేల్ నియోజకవర్గంలో గడపగడపకు ప్రచారం చేస్తామని తెలిపారు.
Also Read.. మళ్లీ పెరుగుతున్న ఉల్లిగడ్డ, టమాట ధరలు
ఈటల రాజేందర్ దళిత వ్యతిరేకి అని, హుజురాబాద్ లో దళితులను అణిచివేశాడని ఆరోపించారు. దళితులపై అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపాడని తెలిపారు. ఈటల మూలంగా హుజురాబాద్ లో ఎన్నో దళిత కుటుంబాలు నాశనమయ్యాయని పేర్కొన్నారు.