రాయితీతో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. ఈ గడువును మరోసారి పొడిగించే ఛాన్సే లేదని పోలీసు శాఖ గతంలో స్పష్టం చేసింది. తొలుత గతేడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు 15 రోజులు అవకాశం కల్పించారు. అయితే, టెక్నికల్ సమస్యల కారణంగా తుది గడువును జనవరి 31 వరకు పొడిగించారు. పెండింగ్ చలాన్లపై టూ వీలర్లు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించారు. దీంతో వీటి చెల్లింపులకు ప్రజల మంచి స్పందన వచ్చింది. ఖజానాకు కూడా భారీగానే ఆదాయం సమకూరింది.
ఇది కూడా చదవండి : ఛత్తీస్గఢ్లో నక్సల్స్ దాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం , 15 మందికి గాయాలు..!!