Saturday, April 27, 2024

తెలంగాణలో షెడ్యూల్‌ కంటే ముందుగానే ఎప్‌ సెట్‌ పరీక్ష

spot_img

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పలు ఎంట్రన్స్‌ టెస్టుల తేదీల్లో మార్పులు జరిగాయి. తెలంగాణ ఎప్‌ సెట్‌ (eapcet) పరీక్షను షెడ్యూల్‌ కంటే ముందుగానే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అలాగే ఐసెట్‌ పరీక్షను ఒక్క రోజు పోస్ట్ పోన్‌ చేసింది.

ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఎప్‌సెట్‌ పరీక్షలు మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్నాయి. పరీక్షలకు, ఎన్నికల తేదీకి ఒక్క రోజు మాత్రమే గ్యాప్‌ ఉండటంతో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎప్‌ సెట్‌ తేదీల్లో మార్పులు చేసింది. మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు నిర్వహించనున్నారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 4, 5వ తేదీల్లో ఐసెట్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ జూన్‌ 4వ తేదీన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా ఐసెట్‌ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీని ప్రకారం.. జూన్‌ 5, 6వ తేదీల్లో ఐసెట్‌ పరీక్ష జరగనుంది.

ఇది కూడా చదవండి: రాత పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగం..వెంటనే దరఖాస్తు చేసుకోండి

Latest News

More Articles