Tuesday, April 30, 2024

ముగిసిన ప్రచారం. ఈనెల 30న పోలింగ్

spot_img

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ప్ర‌చారం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు ప్ర‌చారం మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు ముగిసింది. చివ‌రి రోజైనా మంగ‌ళ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీలు బైక్ ర్యాలీలు, రోడ్ షోలు భారీగా నిర్వ‌హించి, ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. 30వతేదీన పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్‌ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌తో ఎన్నికల ప్రచారాన్ని ముగించారు.

Latest News

More Articles