ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న 2 ఎన్నికల కమిషనర్ల పోస్టులకు నియామకం జరిగింది. ఈ పోస్టులకు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు. దీనికి సంబంధించి, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కమిటీ సమావేశం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరి పేర్లను ఆమోదించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ఈరోజు సమావేశం నిర్వహించామన్నారు. ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, అర్జున్రామ్ మేఘ్వాల్, అధిర్ రంజన్ చౌదరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో 6 పేర్లను చర్చించినట్లు అధిర్ రంజన్ చౌదరి తెలిపారు.
#WATCH | Gyanesh Kumar from Kerala and Sukhbir Singh Sandhu from Punjab selected as election commissioners, says Congress MP Adhir Ranjan Chowdhury. pic.twitter.com/FBF1q44yuG
— ANI (@ANI) March 14, 2024
ఇది కూడా చదవండి: అదిరిపోయే స్కీం..రూ. 500పెట్టుడితే..రూ.2లక్షల మీ సొంతం.!