దీపావళికి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు ధాబా వర్కర్లు తమ యజమానిని కిరాతకంగా చంపారు. ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్పుర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుహి ఫటా సమీపంలోని ధాబాలో శనివారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. మృతుడిని మాజీ సర్పంచ్ రాజు ధెంగ్రేగా గుర్తించారు. నిందితులిద్దరూ మధ్యప్రదేశ్లోని మండ్లాకు చెందిన ఛోటు, ఆదిగా పేర్కొన్నారు. నెల రోజుల క్రితమే వీరు పనిలో పెట్టుకున్నారు.
Also Read.. శతకాలతో దద్దరిల్లిన బెంగళూరు..పలు రికార్డులు నమోదు
ఇటీవల యజమానితో కలిసి భోజనం చేస్తున్న సమయంలో నిందితులిద్దరూ తమకు దీపావళి బోనస్ అడగడం వల్ల ఈ విభేదాలు తలెత్తాయి. అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో యజమానిని హతమార్చాలని కుట్ర పన్నిన నిందితులు.. అదేరోజు రాత్రి భోజనం అయ్యాక ధెంగ్రే నిద్రపోతున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. అనంతరం నిందితులిద్దరూ అతడి కారులోనే అక్కడినుంచి పరారయ్యారు.