ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే కాంగ్రెస్ పార్టీ పనిగా మారిందన్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. కాంగ్రెస్లో చేరకుంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. పటాన్చెరూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. వందల మంది పోలీసులు వెళ్లి మూడు గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏందని ప్రశ్నించారు.ఆయన ఏమైనా బంధిపోటా అని అన్నారు. అయినా FIR కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. బెయిల్ వచ్చే సెక్షన్లతో కేసులు ఉన్న ఏదో ఒక రకంగా జైలుకు పంపాలని చూస్తున్నారు. బెదిరించి లొంగదీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనుకుంటున్నారని తెలిపారు హరీశ్ రావు.
ప్రజలకి సేవ చేయడానికి మీకు అవకాశం ఇచ్చారు..మంత్రి ఆదేశాలతో మేము దాడులు చేస్తున్నామని స్వయంగా RDO చెప్పారన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ క్రషర్లు ఉన్నాయి…వాటికి పర్మిషన్ లేకున్నా లీజ్ అయిపోయినా నడుస్తున్నాయి. BRS నాయకులను టార్గెట్ చేస్తూ ఇదంతా చేస్తున్నారు. ఇప్పటికి మూడు కేసులు పెట్టారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. గ్రామాల్లో తాగు నీరు రావట్లేదు,పంటలు ఎండిపోతున్నాయి అయినా వాటిని పట్టించుకోరు.. ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
మధుసూదన్ రెడ్డి అరెస్ట్ విషయంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు హరీశ్ రావు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ గెలుపుకోసం కలసికట్టుగా కృషి చేద్దాం