నాగర్ కర్నూల్ జిల్లా: పార్టీ మార్పు వార్తలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. తనకు కేసీఆర్ దైవసమానులు అని, కేసిఆర్ కు చెప్పకుండా తాను ఏ నిర్ణయం తీసుకోనని అన్నారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదన్నారు.
మల్కాజిగిరి నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని అన్ని పార్టీల వారు అడుగుతున్నారన్న వార్తలలో వాస్తవం లేదన్నారు. ఇదంతా మీడియా సృష్టించిన గ్లోబల్ ప్రచారం మాత్రమేనని, తాను ఎప్పుడూ ఎక్కడ ఎవరితో పార్టీ మారతానని ఇప్పటివరకు చెప్పలేదన్నారు. తనకున్న డబ్బులను పేద ప్రజల బాగు కోసం ఉపయోగిస్తానని, పార్టీ పనులకు ఉపయోగించనని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడినట్టు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మల్కాజిగిరిలో పోటీ చేస్తాడని ప్రచారం ఉందని గుర్తుచేశారు. పార్టీ మారాల్సి వస్తే కేసీఆర్ కు తన నియోజకవర్గ ప్రజలకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనని ఆయన పేర్కొన్నారు.
Also Read.. నాకు కూడా సైబర్ క్రిమినల్స్ నుంచి కాల్స్ వచ్చాయి.. డీజీపీ రవి గుప్తా