హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ఫేక్ వీడియోలు ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. నలుగురు నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ నలుగురే ఈ వీడియోను అప్లోడ్ చేసినట్టు విచారణలో గుర్తించినట్లు తెలిపారు.
Also Read.. నాగార్జునను అరెస్ట్ చేయాలి.. మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
అయితే, మందన్నా డీప్ ఫేక్ వీడియో తయారు చేసింది మాత్రం వీరు కాదని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డీప్ఫేక్ వీడియోని సృష్టించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నకిలీ వీడియోను సృష్టించిన అసలు నిందితుడి కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ సాగుతున్నట్లు పోలీసులు ప్రకటించారు.