Monday, May 6, 2024

పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం

spot_img

సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ని స్వీకరించిన హరీష్ రావు…సీఎం సవాల్ ని నేను స్వీకరిస్తున్నా.అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరకు నేను వస్తా. ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రమాణం చెయ్యి. ఆగస్ట్ 15 లోపు  పూర్తిగా రుణమాఫీ చెయ్యాలి. ఒకవేళ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను అని తెలపారు హరీష్ రావు. సంగారెడ్డిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన హరీష్ రావు..

మీరు చెయ్యకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని డిమాండ్ చేశారు. నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు. గతంలో కొడంగల్ లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని తెలిపారు.ఆరు గ్యారెంటిలను డిసెంబర్ 9నాడు అమలు చేస్తాం అని మాటతప్పింది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీలను చట్టబద్ధత చేస్తానని చెప్పి మాట తప్పారు. మాట తప్పడం పూటకో పార్టీ మారడం మీ నైజం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే పార్టీ రద్దు చేసుకుంటావా అని తొండి మాటలు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియాగాంధీ తల్లిగా లేఖ రాశారు. 120 రోజులు దాటినా నీ గ్యారెంటీలు ఏమయ్యాయి అని మేము అడుగుతున్నా అని అన్నారు హరీష్ రావు. మహాలక్ష్మీ పథకంలో 2500 మహిళలకు ఎందుకు ఇవ్వలేదు. రైతులకు ఎకరానికి రైతు బంధు 15000 సహాయం ఇవ్వలేదు. ధాన్యానికి 500 బోనస్ ఏది..నిరుద్యోగులకు భృతి ఏదీ అని ప్రశ్నించారు హరీష్ రావు.

ఇది కూడా చదవండి: తెలంగాణ రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు

Latest News

More Articles