Sunday, May 5, 2024

వంద‌ల మంది శ‌ర‌ణార్థుల్ని చంపిన సౌదీ..!

spot_img

యెమెన్ దేశం మీదుగా సౌదీ ఆరేబియాకు వెళ్తున్న ఇథోపియాకు చెందిన వంద‌లాది శ‌ర‌ణార్థుల్ని సౌదీ ద‌ళాలు కాల్చి చంపిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేరకు మాన‌వ హ‌క్కుల సంస్థ దీనిపై నివేదిక‌ను విడుద‌ల చేసింది. సౌదీ ద‌ళాలు జరిపిన దాడుల్లో అనేక సంఖ్యలో శ‌ర‌ణార్థులు తమ శరీర భాగాలను కోల్పోయినట్లు వెల్లడించింది.

హ్యూమ‌న్ రైట్స్ వాచ్‌(హెచ్ఆర్‌డ‌బ్ల్యూ) త‌న రిపోర్టులో అనేక అంశాల్ని పొందుప‌రిచింది. యెమెన్ మీదుగా ప్ర‌తి ఏడాది ఆఫ్రికా నుంచి సుమారు రెండు ల‌క్ష‌ల మంది శ‌ర‌ణార్థులు సౌదీ వెళ్తుంటార‌ని యూఎన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఆర్గ‌నైజేష‌న్ ఫ‌ర్ మైగ్రేష‌న్ తెలిపింది. కానీ త‌మ‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్ని మాత్రం సౌదీ అరేబియా ఖండించింది.

Latest News

More Articles