Sunday, May 5, 2024

ఐపీఎల్ 2023: ఉత్కంఠ పోరులో గెలిచిన హైరదాబాద్

spot_img

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 215 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్.. చివరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. సమద్ సిక్స్ కొట్టి విజయాన్ని అందించాడు.

20 ఓవర్లో చివరి బంతికి మైదానంలో నాటకీయత చోటుచేసుకుంది. సిక్సుకు ప్రయత్నించిన సమద్ క్యాచ్ అవుట్ అయ్యాడు. అందరూ హైదరాబాద్ ఓడిపోయిందని అనుకున్నారు. కానీ అనుహ్యంగా ఆ బంతి నోబాల్ గా అంపైర్లు ప్రకటించడంతో.. మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ఈసారి సమద్ ఎలాంటి తప్పు చేయకుండా సందీప్ శర్మ వేసిన చివరి బంతిని సిక్సుగా మలచడంతో హైదరాబాద్ విజయం సాధించింది.

కీలకమైన ఇన్నింగ్స్ చివరిలో అబ్దుల్ సమద్ 17 (7 బంతుల్లో 2 సిక్సులు), గ్లెన్ ఫిలిప్స్ 25 (7 బంతుల్లో 1 ఫోర్లు, 3 సిక్సులు) ధనాధనా బ్యాటింగ్ తో అలరించారు. అంతకుముందు అన్ మోల్ ప్రీత్ సింగ్ (33), అభిషేక్ శర్మ (55), త్రిపాఠి (47), క్లాసెన్ (26) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ 4, అశ్వీన్, కుల్ దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.

మొదటగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ 95 (59 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులు),  సంజూ శాంస‌న్ 66 నాటౌట్ (38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు)  విధ్వంస‌క బ్యాటింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. హైద‌రాబాద్ ముందు 215 ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ఈ సీజ‌న్‌లో సెంచ‌రీ కొట్టిన‌ య‌శ‌స్వీ జైస్వాల్ 35 (18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు),  రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సన్ ఒక్కో వికెట్ తీశారు.

Latest News

More Articles