Saturday, May 4, 2024

ఏనుగు దంతాల వివాదంలో ధర్మపురి అరవింద్..!

spot_img

సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు నిజామా.. అబద్ధమా అనే విషయం తెలియడం లేదు. యువత విచ్చలవిడిగా సోషల్ మీడియాని వాడేస్తుంది. దీన్ని క్యాచ్ చేసుకోడానికి కొంతమంది జర్నలిస్టుల రూపంలో.. సోషల్ మీడియా ఛానెల్స్ పెట్టి దండాలు,సెటిల్మెంట్స్ కి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఒక సెటిల్మెంట్ సోషల్ మీడియా ఛానెల్ లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటర్వ్యూ జరిగింది. గెలిచిన నెలలో పసుపు బోర్డు తెస్తానంటూ అబద్దాల హామీలతో నిజామాబాద్ ప్రజలని మోసం చేసి ఎంపీ అయినా అరవింద్.. ప్రభుత్వ పెద్దలను తిట్టడమే పనిగా పెట్టుకుంటాడు.

ఈ బూతులని రేండు మూడు సోషల్ మీడియా ఛానెల్స్ సైతం టెలికాస్ట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక సోషల్ మీడియాలో వచ్చిన అరవింద్ ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతుంది. అరవింద్ ని ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో ఆయన ఇంట్లో ఏనుగు దంతాల వంటి వస్తువు కెమెరాకు చిక్కాయి. ఈ క్రమంలో దీనిపై ఫారెస్ట్&వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ స్పందించింది. ‘ఎంపీ అర్వింద్ గా రు… ఇది ఏనుగు దంతాలా? లేక మరి ఏదైనా కళాఖండమా అనేది స్పష్టం చేయండి’ అని ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తెలంగాణ DGP, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి ఫిర్యాదు చేసింది.

Latest News

More Articles