Monday, May 6, 2024

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.!

spot_img

జోగులాంబ అమ్మవారిని మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ దర్శించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అలంపూర్ తాలూక బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ అనంతరం ప్రసంగించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓడినా వెన్నంటి ఉండి ప్రోత్సహించిన నేతలు,కార్యకర్తలు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశం అనంతరం అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారిని కేటీఆర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక కేటీఆర్ ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.

ఈ విషయాన్ని గురించి కేటీఆర్ తెలుపుతూ ట్విటర్ వేదికగా పోస్టు చేశాడు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అలంపూర్ లో జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు. రాష్ట్ర మంతటా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు కేటీఆర్ ఎక్స్‌లో చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్ న్యూస్..భారీగా దిగొచ్చిన బంగారం..ఎంతంటే.!

Latest News

More Articles