Saturday, May 4, 2024

ఎల్బీనగర్‎లో చిరుత కలకలం!

spot_img

ఎల్బీనగర్‎లో పరిధిలో చిరుత కలకలం రేగింది. వనస్థలిపురంలోని సాగర్ కాంప్లెక్స్, రోడ్ నెంబర్ 6లో చివరన ఓ ఇంటిపై చిరుత పులి నిద్రించినట్లు గుర్తించారు. రాత్రి 12.30 గంటలకు ఇంటిమిద్దపై చిరుత పులి సంచరిస్తున్నట్లు ఇంటి యజమాని అఖిల్ గుర్తించాడు. వెంటనే అప్రమత్తమై 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చేలోపు చిరుతపులి.. ఎరోనాటికల్ సంస్థకు ఆనుకొని ఉన్న గోడ నుండి అడవిలోకి వెళ్లినట్లు అఖిల్ తెలిపాడు. అఖిల్ ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.. చిరుత అడుగుల అనవాళ్లను పరిశీలిస్తున్నారు.

Latest News

More Articles