Monday, May 6, 2024

మహారాష్ట్రలో ‘జికా’ వైరస్‌ కలకలం..!

spot_img

మహారాష్ట్రలో జికా వైరస్‌ కలకలం సృష్టిస్తున్నది. ముంబయి చెంబూర్‌ సమీపంలోని ఎం-వెస్ట్‌ వార్డులో నివాసం ఉంటున్న 79 సంవత్సరాల వ్యక్తికి జికా వైరస్‌ సోకినట్లు తేలింది.

అయితే, ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని వైద్యాధికారులు తెలిపారు. బాధితుడు జులై 19 నుంచి జ్వరం, ముక్కు మూసుకుపోవడం, దగ్గుతో సహా పలు లక్షణాలతో బాధపడ్డాడని, ఓ ప్రైవేటు వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నాడని తెలిపారు.

జికా వైరస్‌ను తొలిసారిగా 1947లో ఉగాండాలోని జికా ఫారెస్ట్‌లో గుర్తించారు. 2015లో అమెరికా, బ్రెజిల్, ఆఫ్రికా, నైరుతి ఆసియా, పెసిఫిక్​ ద్వీపాల్లో జికా వైరస్​ కలకలం సృష్టించింది.

భారత్‌లో కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. జికా వైరస్‌ సాధారణంగా ఏడిస్‌ దోమల కారణంగా సోకుతుంది. ప్రస్తుతం జికా వైరస్‌కు నిర్ధిష్టంగా ఏ చికిత్స లేదు.

Latest News

More Articles