చత్తీస్ గడ్: సుకుమా జిల్లా బుర్కాపాల్ లో బందీలను మావోయిస్టులు విడుదల చేశారు. దీంతో వివిధ గ్రామాల ప్రజలు ఇండ్లకు చేరుకున్నారు. బూర్కాపాల్ పంచాయితీ ఉపసర్పంచ్ మడవి గంగ తోపాటు 14 మంది గ్రామస్తులను మూడు రోజుల క్రితం తాడిమెట్ల గ్రామం నుంచి మావోయిస్టులు అపహరించి ఎత్తుకు వెళ్ళిన సంగతి విషయం తెలిసిందే.
నిన్న ప్రజా కోర్టు నిర్వహించి ఉప సర్పంచ్ మడవి గంగా, టీచర్ కావసి సుక్కా ను ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. తమ చెరలో ఉన్న 13 మందిని మావోయిస్టులు విడుదల చేయడంతో బందీల కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.