Saturday, May 4, 2024

ఈటెల భద్రతపై డీజీపీ అంజనీ కుమార్ కు రిపోర్ట్ ఇచ్చిన డీసీపీ..!

spot_img

గత రెండు రోజులుగా ఈటల రాజేందర్ భద్రతపై తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మొదటగా స్పందిస్తూ.. ఈటల రాజేందర్ తనకు అన్నయ్య లాంటివాడని, వెంటనే తెలంగాణ డీజీపీని ఈటల భద్రతపై ఏరాట్లు చేయాలనీ కోరుతానని మీడియాకి చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ ఈటల రాజేంద్ర భద్రతపై సమాలోచనలు చేశారు.

ఈటల భద్రత పై డీజీపీ అంజనీ కుమార్ కు తాజాగా రిపోర్ట్ ఇచ్చారు డీసీపీ సందీప్. ఉదయం ఈటల నివాసానికి వెళ్లిన డీసీపీ సందీప్. ఈటల త్రెట్ కు సంబందించిన వివరాలను అడిగి తెలుకున్నారు. ఈటల చెప్పిన వివరాల ఆధారంగా డీజీపీకి నివేదిక అందించారు మేడ్చల్ డీసీపీ సందీప్.

Latest News

More Articles