Tuesday, April 30, 2024

వితంతువులకు ముత్తూట్ ఫైనాన్స్ బంపర్ ఆఫర్

spot_img

వితంతు, వారి కుమార్తెల వివాహాలకు ఆర్థికసాయం చేసేందుకు ముత్తూట్‌ ఫైనాన్స్‌ ముందుకు వచ్చింది. దేశంలో అతిపెద్ద గోల్డ్‌ లోన్‌ కంపెనీ అయిన ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో వివాహసన్మానం అనే ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపింది. ఇందులో భాగంగా వితంతువులైన తల్లులకు వారి కుమార్తెల పెండ్లి కోసం ఆర్థిక సహాయం అందించడానికి సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు రూ.50వేల సాయాన్ని పొందనున్నారు.

Read Also: హెచ్‌1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం

బెంగళూరు, హైదరాబాద్‌, మధురై, మంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ వంటి ఒక్కో నగరం నుంచి 80 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల నెలవారి ఆదాయం రూ.10వేల కంటే తక్కువగా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.40లక్షల గ్రాంట్‌ను ముత్తూట్‌ వివాహసన్మానం ప్రాజెక్టుకు కేటాయించినట్లు సీఎస్‌ఆర్‌ హెడ్‌ బాబుజాన్‌ మలయిల్‌ తెలిపారు. డిసెంబర్‌ 25న సాయంత్రం 5.30గంటలోపు హిమాయత్‌నగర్‌లోని గ్రాండ్‌పాస్‌ రాయల్‌ మాన్షన్‌లో గల జోనల్‌ కార్యాలయం 3-6-2/1/1, 2వ అంతస్తులో గానీ లేదా 92880 03602 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Latest News

More Articles