Monday, May 6, 2024

రైతుబంధువును ఆదరించండి..! రాబందులను తరిమికొట్టండి..!

spot_img

రైతులకు పెట్టుబడి కింద ఇచ్చే రైతుబంధును ఈసీ ఆపడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రైతులకు పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు అని ప్రశ్నించారు. ఎరువులకు, విత్తనాలకు పైసలిచ్చే రైతబంధును బంద్ పెట్టిస్తున్నారెందుకంటూ మండిపడ్డారు. ఎవుసం చేసే రైతులపైన పగ ఎందుకు అని నిలదీశారు. అన్నదాతకు సాయం అందకుండా అడ్డుపుల్లలు వేసి వికృతానందం పొందుతున్నారెందుకని కాంగ్రెస్ పార్టీని ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.

Read Also: రైతుబంధు ఆపిన కాంగ్రెస్‏ను ఖతం చేయాలి

‘దుక్కిదున్నే బక్క రైతులపై ద్వేషం ఎందుకు…? అన్నంపెట్టే రైతుల మీద అక్కసు ఎందుకు..? కర్షకుడికి కడుపునిండా కరెంట్ ఇస్తుంటే చూసి ఓర్వలేని బుద్ధి ఎందుకు..? 3 గంటల కరెంటే ఇస్తం..10 హెచ్‎పీ మోటర్లు పెట్టుకోవాలని మూర్ఖంగా ప్రకటిస్తున్నారెందుకు..? రైతు చేనుకు రక్షణ కంచెగా ఉండే ధరణి మీద కక్ష ఎందుకు..? దళారుల రాజ్యం తెచ్చి భూమేతకు అనుమతి ఇస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారు ఎందుకు..? కౌలు రైతులకు, అసలు రైతులకు మధ్య అగ్గిపెట్టి భూములు పడావు పెట్టే ప్రమాదాన్ని తెస్తున్నారెందుకు..? అన్నదాతలారా.. మీ వెన్నువిరిచే కాంగ్రెస్ కంత్రీ పాలసీలను జాగ్రత్తగా పరిశీలించండి..! పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండుగ చేసే దరిద్రపు రోజులు కావాలా ..? ఆలోచించండి..! రైతుబంధువును ఆదరించండి..! రాబందులను తరిమికొట్టండి..!’ అని ప్రశ్నించారు.

Latest News

More Articles