తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. తెలంగాణ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. తెలంగాణవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు మొదలైంది.
సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లో కేటీఆర్కు 3,547 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ పార్టీకి 2190 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 1285 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిపై మంత్రి కేటీఆర్ 1300కు పైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
Read Also; గుజరాత్లో భారీ వర్షం.. 11 జిల్లాలను హెచ్చరించిన వాతావరణ శాఖ