Monday, May 6, 2024

నవంబర్‌ 29 తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజు

spot_img

తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజు నవంబర్‌ 29 అని మంత్రి కేటీఆర్‌  అన్నారు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి ఆరోజున బీజం పడిందన్నారు. తెలంగాణ  జాతి విముక్తి కోసం చావునోట్లో తపెట్టిన నేత కేసీఆర్‌  అని చెప్పారు. ఆత్మగౌరవ విశ్వరూపం చూపించి.. పట్టుదలతో తెలంగాణ సాధించారన్నారు. ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్‌ తెలంగాణ సాధించారని చెప్పారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. 14 ఏండ్లుగా నవంబర్‌ 29న దీక్షా దివస్‌ జరుపుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామన్నారు. దీక్షా దివస్‌లో తెలంగాణ ప్రజలంతా ఎక్కడికక్కడ పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

ఇది కూడా చదవండి: టెన్త్ అర్హతతో 26వేలపైగా ఉద్యోగాలకు SSC నోటిఫికేషన్…పూర్తి వివరాలివే..!!

తెలంగాణకు సీఎం కేసీఆర్‌ పాలనే శ్రీరామ రక్ష అని మంత్రి అన్నారు. రైతు బంధు పథకం కేసీఆర్‌ పేటెంట్‌ అని చెప్పారు. రైతు బంధు కొత్త స్కీం కాదని.. కొనసాగుతున్న పథకమన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్‌ వర్తించదన్నారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలు వేస్తే రేవంత్‌ రెడ్డి ఎందుకు ఆగమవుతున్నాడని ప్రశ్నించారు. రైతుల పట్ల కాంగ్రెస్‌కు చిత్త శుద్ధిలేదన్నారు. పీఎం కిసాన్‌ నిధులు ఇస్తే తప్పు లేదుకానీ.. రైతు బంధు ఇస్తే తప్పా అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీది అట్టర్‌ ప్లాప్‌ ప్రభుత్వమని చెప్పారు. ఆ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. కాలం చెల్లిన కాంగ్రెస్‌ ఎంతవాగినా లాభం లేదని విమర్శించారు. కర్ణాటక కాంగ్రెస్‌ నాయకులను తెలంగాణ ప్రజలు పట్టించుకోరని చెప్పారు.

రాహుల్‌ గాంధీ 2014 నుంచి నిరుద్యోగిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఉద్యోగం చేసిన వ్యక్తి కాదని, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నదీ లేదన్నారు. తాను పరీక్షలు రాశానని, ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యానని చెప్పారు. తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం లేదని, ఉంటే చెప్పాలన్నారు. కర్ణాటకలో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు అక్కడ ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదని తెలిపారు.

బీజేపీకి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. ఈసారి గోషామహల్‌లో ఆ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని చెప్పారు. గోషామహల్‌, కరీంనగర్‌, కోరుట్లలో కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థులను పెట్టిందన్నారు. బీజేపీని నిలువరించే శక్తి కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమే ఉందని తెలిపారు. ప్రధాని మోడీని ప్రశ్నించే దమ్ము రేవంత్‌ రెడ్డికి లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్‌ నేతలపైనే జరుగుతున్నాయనడం అవాస్తమవని, బీఆర్‌ఎస్‌ నాయకులపై కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్.

ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం..తెలంగాణలో వర్షం పడే ఛాన్స్..?

 

 

 

 

Latest News

More Articles