Tuesday, May 7, 2024

రేవంత్ రెడ్డి ఇది నీకు సిగ్గుచేటు.. మల్లారెడ్డి సీరియస్..!

spot_img

గట్కేసర్ మండలం చౌదరి గూడ లో మేడ్చల్ నియోజక వర్గ కృతజ్ఞత సభ అట్టహాసంగా జరిగింది. కేటీఆర్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. కృతజ్ఞత సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘ దేశంలోనే అతి పెద్ద నియోజక వర్గం మేడ్చల్. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రిని అయ్యాను. కరోనా సమయంలో ప్రజలందరినీ ఆడుకున్నాము. 61 గ్రామాల్లో సొంత నిధులతో రోడ్లు వేసాను. 125 గుడులను నిర్మించాము. ఓటు అడుగక ముందే అన్ని హామీలు నెరవేర్చి ఓటు అడిగాను. మీకు సేవ చేయడానికే నేనున్నాను. రాజకీయాల కోసమో, సినిమా డైలాగ్ లు చెప్పడం లేదు.

30 సంవత్సరాల నుండి ఎంతో మంది లీడర్లను చూడవచ్చు కానీ నాలాంటి నాయకుణ్ణి చూడలేదు. ఘట్కేసర్ లో రైల్వే బ్రిడ్జి కి మోక్షం కల్పించాం. కాంగ్రెస్ మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో అధికారంలోకి వస్తే అరు గ్యారేంటిలను అమలు చేస్తాననని సిఎం అనడం సిగ్గు చేటు. జూడో యాత్ర చొడో యాత్ర అయింది. ఇండియా కూటమి నుండి అందరూ వెళ్ళిపోయారు. రాష్ట్రంలో 46 వేల చెరువులు నిండు కుండలా ఉన్నవి. అప్పు చేసి అయినా పేద ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకో. లంకె బిందెలు ఉంటే పంచుకుందామని వచ్చారు కాంగ్రెస్ నాయకులు. అభివృద్ధి చేసినవారిని బొంద పెడతా అంటారా. కేసులకు భయపడేది లేదు. మీకు అండగా నేనుంటా’ అని అన్నారు మల్లారెడ్డి,

Latest News

More Articles